విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల రాఘవేంద్ర స్వామి ఆలయం (మఠం) లో రాఘవేంద్ర స్వామి వారి జయంతి ఉత్సవ వేడుకలు ఇటీవల నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తాదులు, ఆలయ కమిటీ, దాతలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవార జాముననే పంచామృతాభిషేకము, బృందావనానికి వెండి కవచంతో అలంకరించిన ప్రత్యేక పూజల నిర్వహణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు భరద్వాజ, బద్రీనాథ్, వేణు నిర్వహించారు. తదుపరి లక్ష పుష్పార్చన జరిగింది. ఆలయ వెలుపల, బయట వివిధ పూలమాలలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ రమేష్ తో పాటు పద్మనాభచారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్. సుబ్బారావు, పోలా ప్రభాకర్, రత్న శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.