ఆర్జేడి రాఘవరెడ్డి కి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వినతి పత్రం
విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎడిఫై వరల్డ్ స్కూల్ కి అనుమతి లేకపోయినా నగరంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తూ 2024- 25 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్లు ప్రారంభమని నగరంలో పెద్దపెద్ద హోల్డింగులు ఏర్పాటు చేసిన ఎడిఫై వరల్డ్ స్కూల్ ను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్జెడి రాఘవరెడ్డి కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ.. జూన్ లో అడ్మిషన్లు ప్రారంభం చేయాలని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధన తుంగలో తొక్కుతూ ఎడిఫై వరల్డ్ స్కూల్ అనే సంస్థ ముందస్తుగా 2024 25 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్లు చేస్తున్న ఆధారాలతో విద్యాశాఖ అధికారులకు అందజేస ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదని ఆర్జెడి కి తెలిపారు. కేవలం నోటీసులకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ఎడిఫై వరల్డ్ స్కూల్ను తక్షణమే సీజ్ చేయాలని పేర్కొన్నారు. ఎడిఫై వరల్డ్ స్కూల్ కి అనుమతి లేకపోయినా, అనుమతికి దరఖాస్తు చేసుకున్నామని జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్నారు. ఎడిఫై వరల్డ్ స్కూల్ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ స్కూలు సిబిఎస్సి సిలబస్ అని ఒక విద్యార్థి నుంచి లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. హోల్డింగులు వెంటనే తొలగించాలని జిల్లా డీఈఓ , మున్సిపల్ కమిషనర్ కి దృష్టికి తీసుకువచ్చిన 15 రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ ఫ్లెక్సీలను ఏమాత్రం తొలగించలేదు అన్నారు. కమిషనర్ కి తెలియజేస్తే ఆ లెటర్ ను డీఈఓ కి ఫార్వర్డ్ చేసి కాలయాపన చేస్తున్నారు. తప్ప ఫ్లెక్సీలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. చర్యలు తీసుకొని తరుణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ సోము పాల్గొన్నారు.