విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు బ్యానర్లు గోడలకు ఎటువంటి రాతలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఓటర్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉన్నట్లు వారు తెలిపారు. త్వరలో కొత్త ఓటర్ల జాబితాను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఎటువంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నేతలు మోడల్ కోడును తప్పక పాటించాలని తెలిపారు. ఇప్పటికే పట్టణంలోనూ పలు గ్రామాలలోనూ ఎన్నికల నిబంధనలు ప్రకారం అన్నియు కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ఫిర్యాదులను 1950 కు చేయవచ్చునని తెలిపారు. కావున ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా సహకరించాలని తెలిపారు.