తమిళనాడులో 2, మహారాష్ట్రలో ఒక స్థానానికి అభ్యర్థుల ఖరారు
న్యూదిల్లీ : లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) తొలి జాబితాను విడుదల చేసింది. తమిళనాడులో రెండు, మహారాష్ట్రలో ఒక లోక్సభ స్థానానికి పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ప్రకటించారు. తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తులో భాగంగా తిరుప్పూర్ నుంచి కె.సుబ్బరాయన్, నాగపట్నం నుంచి వి.సెల్వరాజ్, అలాగే మహారాష్ట్రలోని పర్భాని లోక్సభ స్థానం నుంచి రాజన్ రామచంద్ర క్షీర్సాగర్ను పోటీలో నిలపాలని సీపీఐ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.