విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బలిజిపేట మండలంలోని పలు సాధారణ,సమస్యాత్మక,అతిసమస్యాత్మక గ్రామాలైనా బలిజిపేట,
పెదపెంకి,బర్లి,వంతరాం,చిలకలపల్లి,
గంగాడ,నారంనాయుడువలస, గలావిల్లి, తదితర గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శన చేశారు.పోలింగు స్టేషన్ల భవనాలను సందర్శించి వాటియొక్క స్థితి గతులు,మౌలిక వసతులు,భద్రతపరమైన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొని తగు సూచనలు,సలహాలు ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈసందర్శనలో ఎస్పీతో పాటు పార్వతీపురం రూరల్ సిఐ కె.రవికుమార్,బలిజిపేట ఎస్ఐ వి.పాపారావు ,సీతానగరం ఎస్ఐ యం.రాజేష్ లు పాల్గొన్నారు