విశాలాంధ్ర ధర్మవరం:: చేయవాదిపట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి చూపెట్టెంట్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ రెండు వారాలకు మించి తగ్గు సాయంత్రం పూట జ్వరం ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయినచో మందులు సక్రమంగా వాడితే వ్యాధి నయమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టీవీ పరీక్షలు ఉచితంగా చేస్తారని వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు కూడా ఇస్తారని తెలిపారు. ఈ క్షయ వ్యాధి టీవీ గా మారే అవకాశం కూడా ఉందని తెలిపారు. టీవీ సూపర్వైజర్ రహమద్ బాషా మాట్లాడుతూ ప్రతి క్షయరోగికి పౌష్టిక ఆహారం కోసం ప్రతి నెల 500 రూపాయలు అందజేస్తామని, ప్రతి రోగి మందులు సక్రమంగా వాడుకొని వ్యాధిని నయం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబి యూనిట్ సూపర్వైజర్ కిష్టప్ప ,ఎరుకులప్ప, చంద్రకళ, జయమ్మ, బాలాజీ నాయక్, స్టాఫ్ నర్సులు, ఆర్డిటి బత్తలపల్లి విద్యార్థినీలు పాల్గొన్నారు.
టీబిని నిర్మూలించే దిశలో అందరి కృషి అవసరం::: టీబిని నిర్మూలించే దిశలో అందరి కృషి అవసరమని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వీకెండ్ అండ్ టీవీ అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. 2025వ సంవత్సరానికి టీబిని నిర్మూలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి విభాగం సూపర్వైజర్ రహమత్ భాష, హెల్త్ సూపర్వైజర్స్ రాజశేఖర్ రెడ్డి ,ఆరోగ్య కార్యకర్తలు ఆంజనేయులు, బ్రహ్మానందరెడ్డి, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.