అది మరొకరికి ప్రాణదానమవుతుంది.. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్- హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ దారులు- గోవిందు చౌదరి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ రక్త దానమును ఇచ్చే అలవాటు చేసుకోవాలని, ఆ అలవాటు వలన మరొకరికి ప్రాణదానమవుతుందని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీదారులు గోవిందు చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా సద్గురు బంబం బాబా వారు సద్గురు అన్వరానంద స్వాముల వారి ఆరాధన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సీఎన్బి గార్డెన్స్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మా హెచ్పీ గ్యాస్ సిబ్బంది 20 మంది రక్తదానమును ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఇటువంటి అవకాశం రావడం పట్ల గోవింద చౌదరి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. హెచ్.పీ గ్యాస్ సిబ్బంది మాట్లాడుతూ ఇటువంటి రక్తదానం చేసే అవకాశాన్ని మా ఏజెన్సీదారులు గోవింద చౌదరికి, భంభం బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.