విశాలాంధ్ర- రాజాం : ఈ రోజు రాజాం మండల ఎంపీడీఓ భాసూరు శంకరరావు పదవీ విరమణ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పదవీ విరమణ సన్మాన మహోత్సవాన్ని సిబ్బంది, మండల స్థాయి అధికారులు ,పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ మరియు గ్రామ సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు….. బాసూరి శంకరరావు చేసిన సేవలు ను కొనియాడారు…… ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ & ఆర్డి. వి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించిరి….. జి. లక్ష్మణరావు ఏవో, తెర్లాం ఎంపీడీవో , నరసన్నపేట ఎంపీడీవో జి. రామకృష్ణారావు, ఏఈ పిఆర్ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగన్ అ సిబ్బంది వివిధ శాఖ ల అధికారులు ,అనదికారులు, కుటుంబ సభ్యులు ,బంధువులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా నిర్వహించారు…