విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని రైల్వే స్టేషన్లో పాడేరు నుండి పుట్టపర్తి ప్రశాంతి నిలయం కు రైల్లో వెళుతున్న వారికి పట్టణంలోని శ్రీ సత్య సాయి భజన మండలి వారు 200 మందికి భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో దాతల సహాయ సహకారములతోనే 200 మంది ప్రయాణికులకు భోజనం అందించడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్ నరసింహనాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మరుపురానివని తెలుపుతూ వారికి రైల్వే శాఖ తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు కన్వీనర్ సాంబశివుడు, శేషాచారి, లక్ష్మీనారాయణ, నాగిరెడ్డి జనార్ధన పాల్గొన్నారు.