విశాలాంధ్ర ధర్మవరం:: వైద్య వృత్తిలో శిక్షణ పొందడం వైద్యులకే ఎంతో ఉపయోగమని, ఈ శిక్షణ వల్ల ఎంతోమంది రోగులకు మరింత ప్రాణాన్ని ఇస్తుందని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీ తెలిపారు. ఈ సందర్భంగా స్పందన హాస్పిటల్ లో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సోనియా అడ్వాన్స్ లాపరోస్కోపీ అండ్ ఇష్టిరోస్కోపీ ఆపరేషన్లలో ఐదవ సారి శిక్షణ పొంది ఫెలోషిప్ తో తిరిగి ధర్మారానికి వస్తున్న సందర్భంగా బషీర్ తో పాటు హాస్పిటల్ వైద్యులు సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. స్పందనలో కానుపులు సిజరిన్ ఆపరేషన్లు, విరిగిన ఎముకల ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్ల ఆపరేషన్లు, హెర్నియా అపెండిక్స్ ఆపరేషన్లు ,పురిటి పిల్లలు, చిన్న పిల్లల జ్వరములు మొదలైన వాటికి అర్హులైన వారందరికీ కూడా ఉచితంగా చేయబడునని వారు ప్రకటించారు. ప్రస్తుతం అత్యవసరమైన వైద్య చికిత్సలకు పేదలకు కూడా తాము ఉచిత వైద్య చికిత్సలు అందించడం కూడా జరిగిందన్నారు. పట్టణ ప్రజల ఆశీస్సులతో మరింత అభివృద్ధి పాటలో స్పందన ఆసుపత్రి వెళుతుందని తెలిపారు.