Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీజిఎల్ఐ సమస్యలను పరిష్కరించండి: యస్ టీ యు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా నందు ఉపాధ్యాయుల నెలవారీ ప్రీమియంలు జీతాల నుండి చెల్లింపులు జరుగుతున్నా చాలా నెలలు జమకాలేదని, మిస్సింగ్ క్రెడిట్ క్రింద చూపిస్తున్నాయని, కొత్త బాండ్లు మంజూరు కావడంలేదని వెంటనే మిస్సింగ్ క్రెడిట్స్ జమచేసి కొత్త బాండ్లు మంజూరు చేయాలని ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు ప్రారంభమైన 2013-14 సంవత్సరం నుండి నెలవారి ప్రీమియం చెల్లింపులు మాత్రమే ఏపీజేఎల్ఐ సైట్లో అందుబాటులో ఉండడం, అంతకుముందు సంవత్సరాల నెలవారీ జమ చేసిన ప్రీమియం చెల్లింపులు అందుబాటులో లేకపోవడంతో మిస్సింగ్ క్రెడిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ ఉపాధ్యాయులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్కో ఉపాధ్యాయునికి 10 నుండి 20 నెలల ప్రీమియం జమ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ వారు పాలసీదారుల ప్రయోజనాల రీత్యా ఏపీ జి ఎల్ ఐ సేవలను క్రమబద్ధీకరించి, పాలసీ వివరాలు, స్వీకరించిన చందాలు, తీసుకున్న లోన్ వంటి వివరాలు అప్డేట్ చేసామని, ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ లో ప్రతి ఉద్యోగి లాగిన్ లో అందుబాటులో ఉంచామని ఏవైనా వ్యత్యాసాలు వున్నట్లయితే, ఈ నెల 30 లోగా ప్రతి ఉద్యోగి ధృవీకరణ చేయాలని ఆ శాఖ వారు నోటీసు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నూతనంగా అప్లై చేసిన బాండ్లు డి డి ఓ పరిధిలోని నిధి పోస్టర్ నుండి ఉపాధ్యాయులకు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నా అది ఇంతవరకు ఆచరణలోకి రాలేదని కొత్త బాండ్ల కోసం ఉపాధ్యాయులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల మిస్సింగ్ క్రెడిట్స్ జమచేసి కొత్త బాండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ భోజన తర సిబ్బందికి జేఎల్ పదోన్నతులు కల్పిస్తుండగా అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెంటనే స్కూల్ అసిస్టెంట్లకు జెఎల్ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎస్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు రామాంజులు, జిల్లా కార్యదర్శి రమణ నాయక్, ఉపాధ్యాయులు మురళి, సందీప్,రిజ్వానుల్లా, ఖాన్ షఫీ, షరీఫ్, సుదర్శన్ గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img