ప్రోగ్రాం అధికారి జే శ్యాంసుందర్
విశాలాంధ్ర- విజయనగరం టౌన్ తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విజయనగరం, మన్యం జిల్లాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అధికారి జే శ్యాంసుందర్ తెలిపారు. దీనికి సంబంధించి ఫ్లెక్స్ బోర్డులను గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9న ఉగాది పండుగ సందర్భంగా మన గుడి కార్యక్రమంలో భాగంగా రాళ్లపల్లి రామ సుబ్బారావు చే పంచాంగ శ్రవణము అనంతరం ఉగాది పచ్చడి వితరణ, అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబల్లి మండలం దళాయివలసలో పొందూరు సుధాకుమార్ చే పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరుగును అని కావున విజయనగరం,మన్యం జిల్లాలో ఉన్న భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు