విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజల దాహార్తిని చలివేంద్రాలు తీరుస్తాయని 29వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి బాల్రెడ్డి సుజాత, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రేగాటిపల్లి రోడ్డు కాలభైరవేశ్వర స్వామి దేవాలయం దగ్గర వేశవ కాలమును దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని దంపతులు ప్రారంభించారు. అనంతరం బాల్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ధర్మవరంలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, ఆశక్తి గల దాతలు ఎవరైనా సరే పట్టణములో ఎక్కడైనా చలివేంద్రాలు ప్రారంభించి ప్రజల యొక్క దాహార్తిని తీర్చి మానవతా విలువలను పెంచాలని తెలిపారు. ఈ చలివేంద్రం ఏర్పాటుచేసిన నిర్వాహకులను బాల్రెడ్డి దంపతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.