ఆర్.వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సౌమ్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి కె సౌమ్య అన్నారు. ఆమె ఆదేశాల మేరకు సోమవారం ఆరోగ్య శాఖ సిబ్బంది బాలింతలను వారి వారి గృహాల వద్ద కలసి బాలింతలకు తగు సూచనలు, సలహాలు చేశారు. పౌష్టికాహారం తీసుకోవటం వలన శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నారు. శిశువులకు చిన్నపాటి జ్వరాలు సంభవిస్తే ఆశా కార్యకర్త, ఏఎన్ఎం సలహాలు సూచనలతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రులకు తరలివెళ్లి సకాలంలో వైద్య సేవలు పొందాలని సూచించారు. ఇందులో భాగంగానే ఆరోగ్య శాఖ సిబ్బంది బాలింతల గృహాలను సందర్శించి అవగాహన కల్పిస్తున్నారన్నారు. శిశువులను బయటకు తీసుకెళ్లేటప్పుడు మెత్తని కాటన్ గుడ్డ, ఎండకు గొడుగు, నీళ్ళ సీసా తప్పనిసరిగా వెంటబెట్టుకొని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం హెల్త్ సెక్రటరీ ఏఎన్ఎం కే విజయలక్ష్మి, ఆశా కార్యకర్తలు కే రాజేశ్వరి, జి సంధ్య ఉన్నారు.