విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోమవారం మాజి ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ నివాసానికి వచ్చారు.నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సహకారం అందించాలని జితేంద్ర గౌడ్, ఎం హెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీనాథ్ గౌడ్, హరినాథ్ గౌడ్, పవన్ గౌడ్ లను కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి శివకుమార్, జింకల రామకృష్ణ, రామాంజనేయులు, మహమ్మద్ రఫీ, బాబా, మాధవ, సూరి, రాజన్న, చీమల రము, మస్తాన్, పాల్గొన్నారు…..