.విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని యాదవ వీధిలో గల ఓలేటి విజయ్ కుమార్, తల్లి సుధామణిల ప్రధమ పుత్రిక ఓలేటి వర్షిత ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాలలో రాష్ట్ర రెండవ ర్యాంకు(466/470) సాధించడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తన కుమార్తె వర్షిత పదవ తరగతి పట్టణంలోని జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్నదని అక్కడ కూడా 575/600 మార్కులతో మంచి ప్రతిభ కనబరిచిందని తెలిపారు. స్టేట్ రెండవ ర్యాంకులో అసాధారణ ప్రతిభ కనబరిచిన కుమార్తెకు తల్లిదండ్రులు, బంధువులు, మిత్ర బృందం, వాసవి కళాశాల ప్రిన్సిపాల్, కమిటీ వారు అభినందనలు తెలియజేశారు. స్టేట్ రెండవ ర్యాంకు ఓలేటి వర్షిత సాధించడం మా వాసవి జూనియర్ కళాశాలకు మంచి గుర్తింపు తేవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.