విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ నగరేశ్వర ఆర్యవైశ్య వైదిక సేవా సమితి ద్వారా దహన సంస్కారాలకు కావలసిన వస్తువులను కిట్టు రూపంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని ఆ సేవా సమితి నిర్వాహకులు సీబా సురేష్ గుప్తా, పోలమడ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు తాము తమ సేవలను మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగిందని, 40 మందికి దహన సంస్కారాల కిట్టులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ధర్మవరం కు 36 మంది, చెన్నై కొత్తపల్లి, కర్నూల్, మేడాపురం, ఎన్ఎస్ గేట్ వాస్తవ్యులకు నాలుగు కిట్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.