Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ధర్మరాజు నామినేషన్ తో జనసముద్రమైన గ్రామం

విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ) : ఉంగుటూరు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలి వచ్చిన మహిళలు, యువకులు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దఖాలు చేశారు.ధర్మరాజు తో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీ రాణి, నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయ కర్త వట్టి పవన్, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ధర్మరాజు తొలుత స్వగ్రామమైన నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో గ్రామ దేవత చిట్టాలమ్మా తల్లి వారిని దర్శించుకొని అక్కడ నుండి ర్యాలీగా ప్రారంభమై నారాయణపురం మురుగు కోడు వంతెన దగ్గరకు నిడమర్రు , గణపవరం, గణపవరం భీమడోలు మండలాల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయం వెళ్లారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పత్స మట్ల ధర్మరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి కి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన,టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొనటం జరిగింది. భారీ ఎత్తున జనం రావడంతో ఉంగుటూరు గ్రామమంతా జనసముద్రమైంది. ధర్మరాజు నామినేషన్ తీన్మార్ డబ్బులతో, బాణా సంచులు కాల్పులతో, సినీ నటుల వేషధారణలతో ఊరేగింపు జరిగింది. గ్రామమంతా కూటమి పార్టీ ర్యాలీతో కళకళలాడింది. భారీ ర్యాలీతో కూటమి పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img