నారాయణ రవు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఉగాది రోజున సాయిరాం ట్రస్టు తరుపున పుట్టపర్తి ఆలయానికి వెళ్లి అదృశ్యమైన జీకే వీధి మండలం పెదవలస పంచాయతి కొకితపాడు గ్రామానికి చెందిన లోత నారాయణరావు ఆచూకీ తెలియపరచాలని కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందించిన వరాల ప్రకారం ఉగాది రోజున సాయిరాం ట్రస్ట్ తరుపున పుట్టపర్తి దర్శనానికి వెళ్లిన నారాయణరావు నేటి వరకు గ్రామానికి చేరుకోకపోవడంతో తామంతా ఆందోళన చెందుతున్నామన్నారు. పుట్టపర్తి కూడా వెళ్లి వాకబు చేయడం జరిగిందని, ఆచూకీ లభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పుట్టపర్తి ఆలయానికి తీసుకెళ్లిన సాయిరాం ట్రస్ట్ మేనేజ్ మెంట్ ను సంప్రదించగా వారు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో తామంతా ఆందోళన చెందుతున్నామని, నారాయణరావు ఆచూకీ తెలియపరచాలని కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.