డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ. డాక్టర్. సెల్వియా సల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రతి సచివాలయంలో వయోజన బీసీజీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్.సెల్వియ సాల్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు వివిధ సచివాలయాల్లో పర్యవేక్షణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టీకాను 60 సంవత్సరాలు దాటిన వారికి, చక్కెర వ్యాధిగ్రస్తులకు, పొగాకు/ సిగరెట్టు తాగు వారికి, బరువు తక్కువ గల వారికి, టీబీ వ్యాధి గతంలో వచ్చి నయమైన వారికి, వారి ఇంటి కుటుంబ సభ్యులకు అందరకు కూడా వేయడం జరిగిందని తెలిపారు. ఈ టీకాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజ, డాక్టర్ శ్వేత, టీబి. సూపర్వైజర్ క్రిష్టప్ప, ఏఎన్ఎం కవిత, అర్బన్ సూపర్వైజర్ అన్నం లక్ష్మీనారాయణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.