విశాలాంధ్ర విజయనగరం రూరల్ : విజయనగరంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వవివిధ పోస్ట్ గ్రాడ్యూయేట్ ప్రోగ్రామ్స్ అయిన 1. ఎమ్మెస్సీ కెమిస్త్రీ, 2. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, 3. ఎమ్మే ట్రైబల్ స్టడీస్, 4. ఎమ్మే సోషియాలజీ, 5. ఎమ్మే ఇంగ్షీషు, 6. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, 7. మాస్టర్ ఆఫ్ జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్ మరియు 8. ఎంబిఎ లలో అడ్మిషన్ కొరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విదులచేశారు. ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) నిర్వహించిన సి యు ఈ టి( పి జి ) పరీక్ష రాసిన అందరూ అప్లై చేయడానికి అర్హులని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తేజస్వి కట్టిమని తెలిపారు. అతి తక్కువ ఫీజులతో, అత్యున్నత విద్యా ప్రమాణాలు గలిగిన విద్య అందించబడుతుందని, దానితోపాటు విద్యార్ది సర్వతోముఖాభివృద్ది కొరకు, ఉద్యోగ ఉపాది కల్పన కొరకు ప్రేత్యేక శిక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు.
పైన తెలిపిన పీజీ ప్రోగ్రామ్ లకు అప్లై చేసుకొనదలచిన వారు www.ctuap.ac.in గాని లేదా https://ctuapcuet.samarth.edu.in/pg ద్వారా తమ పేరును 22.05.2024 రాత్రి 11:55 నిమిషముల లోపు రిజిస్టర్ చేసుకోవాలని మరిన్ని వివరాలకు యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ను లేదా, మొబైలు నెంబర్ 6300443499 ను గాని యూనివర్సిటీ పని వెళలలో సంప్రదించాలని ప్రో.కట్టిమని తెలిపారు.