విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురము జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, అనంతపురము నందు ఏ.పి.పి.యస్.సి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి, వెనుకబడిన తరగతులు (బి.సి), షెడ్యూల్డ్ కులాలు (యస్.సి) మరియు షెడ్యూల్డ్ తెగలకు (యస్.టి) చెందిన అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ కు ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 మంది అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుండి 60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ అంద చేయబడుతుందన్నారు.
గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాదించిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్ష హాల్ టికెట్, 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ మార్కు లిస్టులు, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రము (తల్లిదండ్రుల వార్షిక అదాయము రూ.1,00,000/- లోపు మాత్రమే), ఆదార్, బ్యాంక్ పాస్ బుక్ మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి గూప్-2 మెయిన్స్ అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ లోపు ఆంధప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, జిల్లా కలెక్టరు వారి కార్యాలయము దగ్గర, పెన్నార్ భవన్ ప్రక్కన, అనంతపురము కార్యాలయము నందు మీ దరఖాస్తులు అందజేయవలెనని తెలిపారు.
మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయము నందు గాని ఫోన్ నెంబరు 7799043773 మరియు 9704204905 నందు సంప్రదించగలరని అనంతపురము బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు శ్రీమతి ఖుష్బూ కొఠారి తెలిపారు.