విశాలాంధ్ర -శెట్టూరు : శెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రవిశంకర్, అడిషనల్ డీఎంహెచ్ఓ సుజాత సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి పలు రికార్డును పరిశీలించారు, డెలివరీ రూము, రక్త పరీక్ష నిర్వహించే నమూనా గదిని పరిసరించారు గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు ప్రజలకు వైద్య సేవలు అందించడం లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్య సిబ్బందికి సూచించారు అదేవిధంగా శిశు మరణాలు జరిగినప్పుడు మరణాన్ని గల కారణాలు తెలుసుకొని మరోసారి అలాంటి కారణంతో జరగకుండా డాక్టర్లు సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారు గర్భవతులకు అందించే న్యూట్రిషన్ ఫుడ్ సక్రమంగా తీసుకుని విధంగా గర్భవతులకు అవగాహన కల్పించాలని వారు తెలియజేశారు ప్రతి గర్భిణీ స్త్రీని పరీక్షించాలని ప్రమాదకరమైన లక్షణాలున్న గర్భిణీ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతి నెల నిర్వహించే ఆశా డే కార్యక్రమం లో గర్భిణీ స్త్రీలకు తల్లి మరియు బిడ్డకు సంబంధించిన ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు ప్రాథమిక విధులను చుట్టూ కూడా పరిసరాలు పరిశుభ్రమించుకోవాలని ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శోభాలత పిహెచ్ఎన్ సరోజమ్మ, పాంసిస్ట్ యామిని, ల్యాబ్ టెక్నీషియన్ మంజునాథ్, స్టాఫ్ నర్స్ స్నేహ, ఆఫీస్ సిబ్బంది భార్గవి, శివ ప్రసాద్ , నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు