శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పేదలకు వైద్యం చేయడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తొగట వీధిలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో 99వ ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రముఖ వైద్యులైన డాక్టర్. వివేకుల్లయప్ప, డాక్టర్. వెంకటేశ్వర్లు, డాక్టర్. సాయి స్వరూప్, డాక్టర్. ఎం. సుబ్రహ్మణ్యముల చేత రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య విషయాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు రెడ్డిపల్లి సుబ్బమ్మ ,కీర్తిశేషులు రెడ్డిపల్లి రామప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు రామచంద్ర, రాజేశ్వరి, సాయి మనోజ్ వ్యవహరించడం జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా ఈ శిబిరంలో ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతినెలా 150 మందికి అనాధలకు ఒంటరి మహిళలకు 200 రూపాయలు చొప్పున గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ కమిటీ ద్వారా పెన్షన్స్ కూడా అందజేయడం జరుగుతోందని తెలిపారు. కావున ఈ ఉచిత వైద్య శిబిరమును పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని,తమ ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.