రాజాం (విజయనగరం జిల్లా) : ఈరోజు మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు రాజాం పట్టణంలో బొబ్బిలి మెయిన్ రోడ్,వస్త్రపురి కాలనీ, టీచర్స్ కాలనీ, ఫైర్ స్టేషన్ వెనుక కాలనీ, నవ్య నగర్, మొదలగు ఏరియాలలో సానిటేషన్ పనులను మరియు త్రాగునీటి సదుపాయాలను పరిశీలించినారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపైన మురుగు కాలువలలో చెత్తలను వేయరాదని, ఈ సందర్భంగా ప్రజలను నిర్దేశించి కోరారు. రోడ్డు ప్రక్కన పాత సామాన్లను న్యూసెన్స్ కలగజేయు విధముగా వేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని,సానిటరీ ఇన్స్పెక్టర్ వారిని ఆదేశించడమైనది. జూట్ మిల్లులో ఉన్నటువంటి వ్యర్థాలను రోడ్డు ప్రక్కన న్యూసెన్స్ కలుగచేయు విధంగా పడవేయడం మున్సిపల్ కమిషనర్ చూసి జూట్ మిల్లు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరముగా వ్యర్ధాలను తొలగించాలని,లేనియెడల అపరాధ రుసుము విధించబడునని, జూట్ మిల్ సిబ్బందికి తెలియజేసినారు. సదరు పర్యటనలో సానిటరీ ఇన్స్పెక్టర్ చేగుండి ప్రసాద్, సానిటరీ సూపర్వైజర్ జయరాజ్, సానిటరీ సెక్రటరీ భాను ప్రకాష్ పాల్గొన్నారు.