విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని 14 సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు సక్రమంగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు చేయాలని ఎంపీడీవో మమతా దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు కోడ్ ఉన్నందున, ఎన్నికల విధుల్లో కూడా ఉన్నందున సచివాలయాలు కొంతవరకు పని చేశాయని. ఇకనుంచి తప్పనిసరిగా ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు తప్పనిసరిగా సచివాలయ ఉద్యోగులు సచివాలయంలోనే ఉండాలని తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు వరకు మాత్రమే భోజన సమయమును పాటించాలని తెలిపారు. సచివాలయం కు వచ్చే ప్రజలకు గౌరవం ఇస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను అర్హత గల వారికి మాత్రమే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సచివాలయానికి ఆలస్యంగా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగిందన్నారు. ఏ సచివాలయములోనైనా ప్రజలు ఫిర్యాదు చేసే తప్పకుండా విచారణ చేపట్టి సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున సచివాలయ ఉద్యోగులందరూ కూడా తమ విధులను సేవా భావంతో, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుటలో పూర్తిగా సహకరించాలని తెలిపారు.