ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ.
విశాలాంధ్ర ధర్మవరం:; మండల పరిధిలోని గోట్లూరు గ్రామంలో నూతనంగా కడుతున్నటువంటి నైరా ఏరు డైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు గైకొనాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆ పాఠశాల కన్స్ట్రక్షన్ జరుగుతున్నదని ఇందులో భాగంగా పాఠశాలపై అడ్మిషన్లు కూడా జరగడం దారుణమని తెలిపారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఒకటవ రెండవ తరగతులకు 60 వేల నుంచి 70 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంఈఓ కి పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా కూడా స్పందన లేకపోవడం దారుణమని తెలిపారు. నైరా ఎరి డైట్ పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్మాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ప్రదీప్, నవీన్, అభిరామ్, జగదీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.