విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల రెండవ తేదీ అనగా ఆదివారం తెల్లవారుజామున వర్షపాతం డివిజన్లో 129.0 మిల్లీమీటర్లు నమోదు కావడం జరిగిందని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు రెవెన్యూ డివిజన్లోని వర్షపాతం వివరాలను తెలుపుతూ ధర్మవరంలో 9.6 మిల్లీమీటర్లు, బత్తలపల్లి లో 3.4, తాడిమర్రిలో 5.8, ముదిగుబ్బలో 0.0, కనగానపల్లి లో 54.2, చెన్నై కొత్తపల్లిలో 22.6, రామగిరిలో 33.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావడం జరిగిందన్నారు. వర్షపాతం లో కనగానపల్లి 54.2 మిల్లీమీటర్లు ప్రథమ స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో రామగిరి 33.4 బిల్లీ మీటర్లు వర్షపాతం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ గోపాల్ పాల్గొన్నారు.