విశాలాంధ్ర – అమనగల్లు : ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో చోటుచేసుకుంది. గోవిందాయ పల్లి కి చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే కడ్తాల్ మండల కేంద్రంలోని బటర్ ఫ్లై సిటీ లో ఇద్దరు యువకులు దారుణ హత్య చేశారు. మృతులు మండలంలోని గొవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషిగారి శివ (24), గుండెమొని శివ (29)లుగా గుర్తించారు. ఈ హత్యలు బుధవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. హత్యలకు
గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగాఙఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.