విశాలాంధ్ర-విజయనగరం టౌన్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారినిగురువారం ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు, కుమార్తె అధిపతి విజయలక్ష్మి దర్శించుకున్నారు. దేవస్థానంఇఓ డివివి ప్రసాదరావు,ఆలయవేదపండితులు అశోక్ గజపతిరాజు కుటుంబీకుల కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి పూజలు నిర్వహించుకున్న అశోక్ గజపతిరాజు కు అర్చకులు ఆలయమర్యాదలుఅనుసరించి తలపాగా చుట్టారు.ఇటీవలజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థినిగా విజయసాధించిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. విజయోత్సవంఅనంతరం ప్రప్రధమంగా ఆలయానికి విచ్చేసిన అదితి విజయలక్ష్మి కి ఆలయం వద్ద ప్రజలు చూడడానికి విచ్చేసి మనఃపూర్వక అభినందనలు తెలిపారు.
అశోక్ కుటుంబీకులకు ఆలయవేదపండితులు , అర్చకులు వేదాశీర్వచనాలు చేసి అమ్మవారి శేష వస్త్రాలు,ప్రసాదంఅందజేసారు.