విశాలాంధ్ర – పెద్దకడబూరు : మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి నాల్గోసారి ఘన విజయం సాధించడంతో పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వైసీపీ నేతలు హనుమప్ప, హనుమంతు, అంజినయ్య, వెంకటేశ్, శరణప్ప లు మంత్రాలయం మండలంలోని రాంపురం గ్రామంలోని ఆయన స్వగృహం నందు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలనాగిరెడ్డికి, వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.