విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉషోదయ విద్యాసంస్థ నందు పిల్లలకు, పెద్దలకు స్త్రీ, పురుషులకు ఈనెల 15 నుండి 21 వరకు యోగ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగ గురువు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లేటి సతీష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ నెల 21 వరకు, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో సూర్య నమస్కారాలు ప్రాణాయామం, ఆసనాలు ధ్యానం తదితర విషయాలపై వారం రోజులు పాటు యోగ అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. మరిన్ని వివరాలకు. 9291276900 మొబైల్ నెంబర్ లో సంప్రదించవలసిందిగా కోరారు.