విశాలాంధ్ర -ఆనందపురం ( విశాఖ జిల్లా) : ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ గారి పేట గ్రామానికి చెందిన బాలుడు బాత్రూం బకెట్లో పడి మృతి చెందాడు.వివరాలు ఇలా ఉన్నాయి గారి పేట గ్రామానికి చెందిన మరుపాల లక్ష్మణ్ ,కళ్యాణ్ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు హిమన్షు (4) చిన్న కుమారుడు నో మోక్షిత్ ఏడాదిన్నర సంవత్సరాలు. ఇలా ఉండగా మంగళవారం రాత్రి భోజనాలు అనంతరం చిన్న కుమారుడు నోక్షిత్ కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా బాత్రూములో బకెట్లో పడి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు బుధవారం మృతి చెందాడు. ఈ కేసును సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏఎస్ఐ పైడ్రాజు దర్యాప్తు చేస్తున్నారు.