విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కాలువ తలుపుల వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సూగూరు డిస్ట్రిబ్యూటర్ కు టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, బీసీ సాధకార కమిటీ సభ్యులు మల్లికార్జున సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్ఎల్సీ పరిధిలోని ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మీసేవ ఆంజనేయ, తలారి అంజి, బొగ్గుల నరసన్న, ఆదాము, ఇమ్మానియేలు, ఆశప్ప, బాబు, లస్కర్లు పాల్గొన్నారు.