పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రద్దు అయింది. పల్నాడు ప్రాంతంలో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రద్దయ్యింది. ప్రత్యామ్నాయంగా మంగళగిరి, లేదా పేరేచర్ల ప్రాంతంలో వనమహోత్సవం నిర్వహించాలన్న ఆలోచనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ల పర్యటన రద్దుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.