Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రలోభాలతో భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్న ఆదివాసీలు

ఎన్నికల సమయంలోనే ఆలోచన చేయాలంటున్న భారత్ ఆదివాసీ పార్టీ.

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరిసీతారామరాజు జిల్లా) : – ప్రలోభాలకులకు లొంగి
ఆదివాసీలు భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు. .రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రిచెట్టి పోతురాజుతో కలిసి ఆయన మాట్లాడుతూ పాలకులు , రాజకీయ పార్టీలు నువ్వే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఏదో ఒక పేరుతో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి సమయంలో ఆదివాసీలు ఆలోచన చేయవలసిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీల నేతలు వారి పిల్లల, వారి కుటుంబాల, వారి కులాల భవిష్యత్తు మార్చుకొనే ప్రయత్నంలో భాగంగానే ఈ భవిష్యత్తు డ్రామాలు ఆడుతున్నారనీ, .ఆదివాసీల త్యాగాల మీద వారి భావితరాల భవిష్యత్తు కు పునాదులు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. మన్య ప్రాంతంలో నిర్మించే ఏ పవర్ ప్రాజెక్ట్ అయినా, ఏ డ్యామ్ లైనా, ఏ అభివృద్ది కార్యక్రమమైనా ఆదివాసీలే సమిదలవుతున్నారనీ,.పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న తరుణంలో వేలాది మంది ఆదివాసీ కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారనీ, వారికి నష్టపరిహారం అందించడంలో పాలకులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం ఆదివాసీలపై పాలకులకు ఉన్న కపట ప్రేమకు నిదర్శనం అన్నారు. బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో కలిపితే గిరిజనులకున్న 6 శాతం రిజర్వేషన్ ని వారే అనుభవిస్తారు.కానీ పాలక, ప్రతి పక్ష పార్టీలు బోయవాల్మీకులను గిరిజన జాబితాలో కలుపుతామంటూ గందరగోళ పరిస్థితి నెలకొల్పారన్నారు. నిరుద్యోగులకు గుండెకాయ వంటి.జిఓ 3 రద్దు చేసీ ఆదివాసీ హక్కులు హరించారన్నారు.గిరిజనులకున్న 6 శాతం రిజర్వేషన్ కు మైదాన ప్రాంత గిరిజనులైనా లంబాడ, ఎరుకుల వంటివారు పోటి పడే పరిస్థితులు కల్పించారన్నారు. నకిలీ, కృత్రిమ గిరిజనులను ప్రభుత్వాలే తయారు చేస్తున్నాయని,.రాజకీయ పదవులు కూడా వారికే కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివాసీలకు కేటాయించిన ఒక ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాల వెనుక ఆదివాసేతరులు ఉండి, వారిచేత తప్పుడు నిర్ణయాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఇలాంటప్పుడు ఆదివాసీలకు రాజకీయ పార్టీలు ఇచ్చే భవిష్యత్తు గ్యారంటీలు అవసరం లేదన్నారు. ఆదివాసీలను కట్టుబానిసలుగా వాడుకుంటున్న వారిని ప్రశ్నించవలసిన తరుణం ఆసన్నమైందన్నారు..ఆదివాసేతర పార్టీల మేనిఫేస్టోలు ఆదివాసీలకు పనిచేయవని, ,ఆదివాసీల హక్కులు,చట్టాలు కాపాడుకోవాలంటే ఆదివాసీల రెక్కల కష్టంతో ఏర్పడిన భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్ధులనే ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img