కే బీ ఫౌండేషన్ చైర్మన్ కన్నబాబు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఇంకుడు గుంతల ఏర్పాటుకై సామాజిక చైతన్యమే కే బి ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ చైర్మన్ కొక్కుల కన్నబాబు అన్నారు. మండలంలోని లోతుగేడ్డ జంక్షన్ లో ఆ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వంతల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం 5 మండలాలలోని సంబంధిత మండల కోఆర్డినేటర్లు, పంచాయితీలకు సంబంధించిన క్లస్టర్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంకుడు గుంతలు నిర్మాణము లొ ప్రజలు భాగస్వాములు అవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు చైతన్యం కలిగి పక్క గ్రామాల ప్రజలకు కూడా స్వచ్ఛందంగా ఇంకుడు గుంతల నిర్మాణము జరుపు కునేందుకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. యజ్ఞంలా చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమానికి ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కే బీ ఫౌండేషన్ చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం అభినందనీయమని గిరిజన గ్రామాల ప్రజలు కొనియాడుతున్నారు. కార్యక్రమంలో మoడల కోఆర్డినేటర్లు, పంచాయితీ క్లస్టర్ కోఆర్డినేటర్లు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.