Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చూస్తే వైకాపా ప్రభుత్వానికి వణుకు

తెదేపా ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు, మాజీ మంత్రి మణి కుమారి.

విశాలాంధ్ర చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చూస్తే వైకాపా ప్రభుత్వానికి వణుకు పుడుతుందని తెదేపా ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు అన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయితీ కోరుకొండ, చెరువూరు, దిగజనబ, లమడం పల్లి , తడ్డాపల్లి, బూరుగుబయలు, బలపం గ్రామాల్లో గురువారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో బడికోస్త పథకం ద్వారా విద్యార్థులకు 5 .63 లక్షల సైకిళ్ళు పంపిణి చేసిన ఘనత తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది అయితే అమ్మఒడి ని ఆంక్షల ఒడి గా మార్చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిన ముఖ్యమంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఐ .టి డి ఏ ల్లో 122 బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులో టీడీపీ ప్రభుతం చేస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ నిరక్ష్య ధోరణితో ప్రవర్తిస్తుంది అన్నారు. మాజీమంత్రి మణికుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయంలో వేసిన రహదారులు మినహా, 2900 గ్రామాల్లో సింగిల్ లైన్ విద్యుత్, ప్రతి అడబిడ్డ కు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా నూతన వధూవరులకు చంద్రబాబు పెద్దన్నలా ఆర్థిక సాయం చేస్తే దానిని కూడా ఆంక్షల కనుక గా మార్చేసిన ఘనపాటి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చూస్తేనే వైకాపా ప్రభుత్వానికి ఆ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీడీపీ, జనసేనలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి గ్రామానికి మేనిపెస్టోను తీసుకెళ్లి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే బలపం పంచాయితీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకాయమ్మ, చిట్టిబాబు, పంచాయతీ అధ్యక్షులు నారాయణ, సాంస్కృతిక విభాగం నాగబ్బాయి, పాడేరు మాజీ ఎంపీపీ పిన్నయ్య దొర, బూత్ నెంబర్ తెల్లన్న దొర, టీఎన్ఎస్ఎఫ్ వినోద్, ముర్ల సత్తిబాబు తెలుగు మహిళలు నాయకులూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img