నిరుపేద గిరిజన మహిళలకు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ల పంపిణీ
స్వర్ణలత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ పి. స్వర్ణలత.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నిరుపేద గిరిజన మహిళలు కుట్టు మిషన్ల ద్వారా చేతి వృత్తిని నేర్చుకుని ఆర్థికంగా ఉపాధి పొందాలని రాజమండ్రి కి చెందిన స్వర్ణలత సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పి స్వర్ణలత అన్నారు. మండలంలోని గడపరాయి గ్రామంలో గురువారం ఆ గ్రామంలో ఉన్న నిరుపేద గిరిజన మహిళలకు ఆమె 30 కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాటలు చెప్పే పెదవుల కన్నా.. అన్నం పెట్టే చేతులు మిన్న, మాటల్లో కాదు కృషి, పట్టుదల ఉంటే చేతల్లో చూపించాలి అనే నినాదంతో మహిళలను చేతివృత్తుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఆలోచనతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు తమ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 8 వేల మందికి కుట్టుమిషన్లు అందజేయడం జరిగిందన్నారు. అదే క్రమంలో మన్య ప్రాంతంలోనూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో గడప రాయి గ్రామంలో ఈరోజు (గురువారం) 30 మిషన్లను స్థానిక నిరుపేద మహిళలకు అందజేయడం జరిగింది అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు ఆమెను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు సిహెచ్ రాజా రమేష్, కొర్ర సూరిబాబు, పాస్టర్లు కొర్ర సామ్యూల్, దొరబాబు, పాంగి రాంబాబు, సీందెరి రాంబాబు, కుట్టుమిషన్ ల లబ్ధిదారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.