ఎంపీపీ అనూష దేవి, సర్పంచ్ పుష్పలత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని మేజర్ పంచాయతీ అయిన చింతపల్లి పరిధిలోని చిన్నగెడ్డ గ్రామ వాలంటర్ రామ్మూర్తి బార్య వంతల రంభ, కందుల గాదె గ్రామంలోని వైకాపా కార్యకర్త అర్జున్ లు అనారోగ్యంతో మరణించటం విచార కరమని, ఆ కుటుంబాలకు వైకాపా అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీపీ అనూష దేవి అన్నారు. రంభ, అర్జున్ లు మరణించిన విషయం తెలిసిన వెంటనే స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, వాలంటీర్ల సంఘం మండల అద్యక్షుడు వేములపూడి పరమేష్ లతో కలసి చిన్నగెడ్డ, కందుల గాదె గ్రామాలకు వెళ్లిన ఆమె ఆ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. చిన్నగెడ్డ లో మరణించిన రంభ , కందులగాదె లో మరణించిన అర్జున్ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా తామున్నామంటూ భరోసా కల్పిస్తూ ఆ రెండు కుటుంబాలకు తక్షణ సహాయంగా సర్పంచ్ పుష్పలత ఎంపీపీ అనూష దేవి చేతుల మీదుగా 5000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. కార్యక్రమంలో నాయకులు హేమంత్, లోవ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు