Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైకాపా అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి మనో నిబ్బరాన్ని కలిగించిన కుడుము సారి వార్డు సభ్యుడు సింహాచలం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సోమవారం అన్నవరం వారపు సంత నుంచి తిరుగు ప్రయాణంలో జీపు బోల్తా పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెరికల గ్రామానికి చెందిన జర్త చిన్నమ్మి, వంతల అప్పారావు ల కుటుంబాలను కుడుము సారి పంచాయతీ వార్డు సభ్యుడు బోండా సింహాచలం బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సింహాచలం ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీపు ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇరువురు మృత్యువాత పడటంతో పాటు పలువురు తీవ్ర గాయాల పాలవడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించిందన్నారు. తమ పంచాయతీలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తరతరాలుగా సరైన రహదారులు లేక ఇటువంటి ఎన్నో ప్రమాదాలు సంభవించి చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పెద్ద పెద్ద వంతెనలు నిర్మాణానికి నోచుకోలేదన్నారు. దీనికి తోడు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గిరిజనులు ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఏదేమైనప్పటికే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని, ఆ ప్రమాదంలో ఇరువురు మృత్యువాత పడటం విచారకరమని అన్నారు. అదే క్రమంలో గాయపడి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న ఆ కుటుంబాలకు వైకాపా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కుడుము సారి పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, గ్రామస్తులు, చిన్నమ్మి, అప్పారావు కుటుంబ సభ్యులు ఉన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img