Monday, May 6, 2024
Monday, May 6, 2024

నాడు వైసిపి అభ్యర్థులు… నేడు కూటమి అభ్యర్థులు

పాడేరు అసెంబ్లీకి ఈశ్వరి, అరకు పార్లమెంటుకు గీత

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నాడు వైసిపి పాడేరు శాసనసభ, అరకు పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించి చట్టసభలలో అడుగుపెట్టిన గిడ్డి ఈశ్వరి, కొత్తపల్లి గీత లు నేడు కూటమి అభ్యర్థులుగా అవే స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. నాడు వైసిపి ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన వీరు వివిధ కారణాల చేత ఆ పార్టీని వీడి గిడ్డి ఈశ్వరి తెదేపా లో, కొత్తపల్లి గీత బిజెపిలో చేరారు. నేడు తెదేపా జనసేన బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పాడేరు శాసనసభ అభ్యర్థిత్వం గిడ్డి ఈశ్వరికి కేటాయించగా అరకు పార్లమెంటు స్థానాన్ని బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత కు అవకాశం కల్పించారు. నాడు వైసీపీ తరుపున పోటీ చేసి సమన్వయంతో విజయం సాధించిన వీరిరువురు మరలా నేడు కూటమి అభ్యర్థులుగా అవే స్థానాల నుంచి పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img