విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు తెదేపా ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే, తెదేపా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెదేపా విజయంతోనే మన్యప్రాంత అభివృద్ధి సాధ్యమని, బడుగు బలహీన వర్గాలతో పాటు రాజకీయ పార్టీలకు అతీతంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు. పాడేరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనను ప్రజలు ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.