విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రయాణీకులు సౌకర్యార్థం మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు వాల్తేరు డివిజన్ పరిధిలో పలు రైళ్లకు ఎల్.హెచ్.బి. కోచ్లు (యాంటీ టెలిస్కోపిక్ ) జత చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ముందుగా విశాఖ ఎం.జి.ఆర్.చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ శుక్రవారం ప్రారంభించగా, 25 న ఎం.జి.ఆర్.చెన్నై సెంట్రల్ విశాఖ వీక్లీ ఎక్స్ ప్రెస్, 26 న విశాఖ పారాదీప్ వీక్లీ ఎక్స్ ప్రెస్ కి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్లు వాటి ముందున్న కోచ్లపైకి ఎక్కే ఆస్కారం ఉండదు.
అధిక వేగంలోనూ సమర్థమైన బ్రేకింగ్ కోసం ఎల్.హెచ్.బీ కోచ్లలో ‘అడ్వాన్స్డ్ న్యూమాటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్’ను వినియోగిస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్గా వేగం తగ్గి నిలిచిపోయేలా ఈ బోగీలను రూపొందించారు. రైళ్లు పరస్పరం ఢీకొన్నా, పట్టాలు తప్పినా.. బోగీలు ఒక దానిపైకి మరొకటి ఎక్కే ముప్పు ఉండదు.
ఐసీఎఫ్ కోచ్లలో డ్యుయల్ బఫర్ సిస్టమ్ ఉండగా.. ఎల్హెచ్బీ కోచ్లలో సెంటర్ బఫర్ కప్లింగ్ (సి.బి.సి) వల్ల వైట్ వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్తో ఢీకొట్టుకోకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది.
ఎల్హెచ్బీ కోచ్లను గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించారు. 180 kmph వేగం వద్ద కూడా ఈ కోచ్లు సత్ఫలితాలను ఇచ్చాయి. ఐసీఎఫ్ కోచ్ల గరిష్ట వేగం 110 kmph మాత్రమే.