మూడు వేట కొడవళ్లు, ఆటో, ఇనుప రాడ్ స్వాధీనం
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం రిలయన్స్ మార్ట్ లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా మూడు వేట కొడవళ్ళు, ఆటో ఇనపరాడు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కుట్ర భగ్నం
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు
ప్రస్తుతం అరెస్టయిన గుజ్జల రుశ్యింగులు గతంలో గుజరి, సిల్వర్ సామాన్ల వ్యాపారం చేసేవాడు అన్నారు. ఆ వ్యాపారంలో సుమారు రూ. 7 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఆ అప్పులు తీర్చేందుకు తనకు దూరపు బంధువు అయిన స్థానిక రిలియన్స్ మార్ట్ లో పనిచేసే రాగిరి శ్రీనివాసులు మరియు కళ్యాణదుర్గం చెందిన చంటిలను సంప్రదించాడన్నారు. వీరితో కలసి రిలియన్స్ మార్ట్ లో దోపిడి చేయాలని భావించి పధకం రచించాడు. రిలయన్స్ మాల్ నుండి రోజు సుమారు రూ. 25 -30 లక్షలు కలెక్షన్ డబ్బులు మేనేజర్ బ్యాంకుకు తీసికెళ్తుంటాడని… మేనేజర్ ను అడ్డగించి డబ్బులు దోపిడి చేయవచ్చని భావించారు. ఈ పథకం కోసం రెక్కీ కూడా చేశారు. దీంతో పాటు మరో రాబరీకి వ్యూహరచన చేశారు. స్థానిక హౌసింగు బోర్డులోని వర్తకుల ఇంట్లో దోపిడీ చేయాలని పథకం పన్నారు. ఆ ఇంట్లో వృద్ధురాలు, కూతురు, బాలుడు ఉంటారని… సులువుగా దోపిడీ చేయచ్చని భావించారు. దోపిడీ చేసే క్రమంలో అడ్డువస్తే చంపేయాలని కూడా అనుకున్నారు.
జిల్లా స్పెషల్ బ్రాంచి నుండీ సమాచారం అందుకున్న జిల్లా ఎస్ పి కె .కె .ఎన్ . అన్బురాజన్ ఈ రెండు కుట్రలను భగ్నం చేయాలని ఆదేశించారు. దీంతో డి ఎస్ పి జి. వీరరాఘవ రెడ్డి పర్యవేక్షణలో అనంతపురము 1 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వి . రెడ్డప్ప మరియు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా వేశారు. ఈ క్రమంలో రాబడిన సమాచారం మేరకు ఈరోజు సూపర్ స్పెషాలటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద నిందితులను అరెస్టు చేసి వారి నుండి మూడు వేటకొడవండ్లు, ఐరన్ రాడ్ , ఆటో స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే డయల్- 100 లేదా తన ఫోన్ నంబర్ 9440796800 కు సమాచారం చేర వేయాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.