విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంత జిల్లా ఆర్టీసీ గ్యారేజీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ ఏ డి ఎఫ్ కే లింగమయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముందుగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని నివారించడానికి నియంత్రణ సిలిండర్లను ఏ విధంగా వాడాలి, వివిధ అగ్నిమాపక నియంత్రణ పరికరాలను ద్వారా వారికి డెమో చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిసరాలలో ఎటువంటి ఆయిల్ తో నిండిన బట్టలు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ పరికరాలను ఉపయోగించేటప్పుడు నాణ్యమైన కేబుల్ ని వాడాలన్నారు. నియంత్రణ పరికరాలను అప్పుడప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్యారేజ్ ఇన్చార్జి ఇక్బాల్, ఫైర్ సిబ్బంది ఎం. రమేష్,బాల, వెంకటయ్య, తిప్పేస్వామి, ఎల్ ఎఫ్ కృష్ణ కుమార్ , ఆర్టీసీ డిపో మేనేజర్ రాంభూపాల్, ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.