సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విస్తృత ప్రచారం
విశాలాంధ్ర -అనంతపురం (వైద్యం) : కాంగ్రెస్ సిపిఎం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సి.జాఫర్ (కంకి కొడవలికి) గుర్తుకు, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జల మల్లికార్జున (హస్తం గుర్తుకు) ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 21 వ డివిజన్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి.రమణయ్య ,ఈ.రాజేష్ గౌడ్ ,జి చిరంజీవి,నగర కార్యవర్గ సభ్యులు గాదిలింగప్ప,వన్నూరు భాష,ఈశ్వరయ్య రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.