London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

తక్కువ ధరకే బియ్యము, కందిబేళ్ల పంపిణీ… ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ మార్కెట్ కన్నా తక్కువ ధరకే బియ్యము,(సన్న బియ్యం) కంది బేళ్లను పంపిణీ చేస్తున్నామని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో రైతు బజార్ కౌంటర్ ను ఆర్డిఓ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతు బజారులో బియ్యము ఒక కేజీ 44 రూపాయలు ప్రకారం 5 కేజీలను, కందిబేలు కేజీ 135 రూపాయలు ప్రకారం 2 కేజీలు ఇవ్వబడునని తెలిపారు. బయట మార్కెట్ ధర కన్నా దాదాపు పది రూపాయలు తేడా ఉంటుందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారికి లేనివారికి కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే పాండురంగ స్వామి గుడిలో ఈ రైతు బజార్ కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి… లక్ష్మీదేవి, స్థానిక తహసిల్దార్ యుగేశ్వరీ దేవి, రైస్ మిల్ , కిరాణా హోల్సేల్ అసోసియేషన్ నాయకులు గంగిరెడ్డి, పిన్ను ఆచారి, తేజ, మధు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img