విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణం లోని కోట లోపల గల జైన్ దేవాలయం ఎదురుగ వున్న స్థలం నందుఁ ఎయిర్ టెల్ ఁటవర్ ఏర్పాటు జరుగుతున్నది. టవర్ ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నుండి అత్యంత సమీపంలోనే దేశంలోనే ప్రసిద్ధి గాంచిన జైన దేవాలయంకు పలు రాష్ట్రల నుండి నిత్యం భక్తదులు వస్తుంటారు, అలాగే మరింత దూరంలో దక్షిణ భారత దేశ షిర్డీగా పేరుగాంచిన షిర్డీసాయి నాధుని దేవాలయం వుంది. మరికొంత దూరంలో చరిత్మకమైన జామియా మసీదు ప్రక్కనే బాలికల ఉన్నత, జూనియర్ కళాశాలలు వున్నాయి. టవర్ ఏర్పాటు చేస్తున్న ప్రదేశం చుట్టూ ఇండ్లు వుంటూ, నిత్యం ప్రజలతో, భక్తదులతో, విద్యార్థిని, విద్యార్థులతో రద్దిగా వుండే చోట టవర్ ఏర్పాటుచేయడం వలన, పలురకాల ఆరోగ్య సమస్యలు, టవర్ నుంచే ధ్వని వలన అసహనం, ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ కావున వెంటనే తగు చర్యలు తీసుకొని టవర్ ఏర్పాటును నిలుపుదల చేయించాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ద్వారా తెలియ చేయడం జరిగిందనీ తెలిపారు ఈ కార్యక్రమంలో హరి, రమేష్, గంగాధర, కౌన్సిలర్లు సద్దాం, ఘన, సక్షా, కట్టాశ్రీనివాసులు, జైన్ దేవాలయం నిర్వాకులు దినేష్, డిష్ శేషు, స్టోర్ డీలర్స్ వెంకటేశులు, శీనా, టైలర్ హరి, మహిళాలు, తదితరులు పాల్గొన్నారు.