హెచ్ఎం మేరీ వర కుమారి
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం డివిజన్ ఆర్డిటి వారు నిర్వహించిన అథెటిక్స్ పోటీలలో, పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మంగళవారం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో లాంగ్ జంప్ లో తానియా జిల్లా లో ఎంపిక కావడం, 100 మీటర్ల పరుగు పందెంలో నవ్య ప్రథమ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో బృందం మూడవ స్థానం, 400 మీటర్ల పరుగు పందెంలో నవ్య ప్రధమ స్థానం సాధించి, పాఠశాలకు, ధర్మవరంకు మంచి గుర్తింపు తేవడం జరిగిందని తెలిపారు. మా కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మా విద్యార్థులు మంచి ప్రతిభను కనపరచడం జరిగిందన్నారు. తదుపరి హెచ్ఎం తో పాటు ఇంచార్జ్ హెచ్ఎం. శారద, పిఈటి. అశ్విని, పాఠశాల ఉపాధ్యాయులు రాము, ఆదినారాయణ, తదితరులు ఆ విద్యార్థినిలను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.